Telugu Global
National

కవితకు మళ్ళీ నోటీసులు జారీచేసిన‌ ఈడీ...ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఈ రోజు ఉదయం 11 గంటల‌కు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల తాను ఈ రోజు ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పిన కవిత‌ తన తరపున తన ప్రతినిధిగా బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు కవిత

కవితకు మళ్ళీ నోటీసులు జారీచేసిన‌ ఈడీ...ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
X

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తమ నోటీసుల్లో ఈడీ అధికారులు ఆదేశించారు.

కాగా, ఈ రోజు ఉదయం 11 గంటల‌కు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల తాను ఈ రోజు ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పిన కవిత‌ తన తరపున తన ప్రతినిధిగా బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు కవిత. ఈ రోజు తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ పంపారు . కవిత లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ నెల 20న తమ ముందు హాజరు కావాల్సిందిగా కవితకు నోటీసులు జారీ చేశారు.

First Published:  16 March 2023 9:04 AM GMT
Next Story