Telugu Global
National

తాగొచ్చి తల్లిపై దాడి చేసిన కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి

ఆదర్శ్ నిత్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆదర్శ్ తల్లిదండ్రులతో మరొకసారి గొడవ పెట్టుకున్నాడు.

తాగొచ్చి తల్లిపై దాడి చేసిన కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి
X

ఆ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. అతడు పెళ్లీడుకు వచ్చినా బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నాడు. నిత్యం తాగి ఇంటికి రావడమే కాకుండా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. కుమారుడి వేధింపులతో ఆ తల్లిదండ్రులు విసిగిపోయారు. రోజూ వేధింపులు భరించలేక కుమారుడిని చంపేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించి చంపేశాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

బెంగళూరు సమీపం దొడ్డబొళ్ళాపుర తాలూకా వాణిగరహళ్లికి చెందిన జయరామయ్యకు ఆదర్శ్ (28) ఒక్కగానొక్క కుమారుడు. అయితే అతడి వ్యవహారం కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదర్శ్ నిత్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆదర్శ్ తల్లిదండ్రులతో మరొకసారి గొడవ పెట్టుకున్నాడు. తల్లిని దుర్భాషలాడటమే కాకుండా ఆమెపై దాడికి తెగ‌బ‌డ్డాడు.

దీంతో ఆగ్రహించిన తండ్రి జయరామయ్య కొడుకును సమీపంలోని పనస తోట వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ అతడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తండ్రే కుమారుడిని దారుణంగా హత్య చేయడం ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు.

First Published:  2 July 2023 4:43 AM GMT
Next Story