Telugu Global
National

ఈసారి విస్తారా విమానంలో.. అర్ధ నగ్నంగా తిరుగుతూ మహిళ రచ్చ

విమానం ముంబై చేరుకున్న తర్వాత ఈ విషయమై కెప్టెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటలీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ఈసారి విస్తారా విమానంలో.. అర్ధ నగ్నంగా తిరుగుతూ మహిళ రచ్చ
X

విమానాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎర్ర బస్సుల్లో కూడా అటువంటి ఘటనలు జరిగి ఉండ‌వేమోనని అనిపిస్తోంది. విమానాలు ఎక్కుతున్నవారు మరి హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆయా విమానయాన సంస్థలకు చిక్కులు తెచ్చి పెడుతున్నారు. ఇటీవల ఓ విమానంలో సీటు కోసం కొందరు యువకులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. చెంపలు వాయించుకున్నారు. మరొక అంతర్జాతీయ విమానంలో ఒక వ్యక్తి తప్ప తాగి వృద్ధురాలిపై మూత్రం విసర్జించాడు. తాజాగా ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ విస్తారాకు చెందిన అబుదాబి-ముంబై విమానంలో ప్రయాణిస్తూ అర్ధ నగ్నంగా తిరుగుతూ రచ్చ చేసింది.

విమానం అబుదాబి నుంచి ముంబైకి వస్తుండగా పావులో పెరుసియో అనే మహిళ ఎకానమీ క్లాసు టికెట్ కొని బిజినెస్ క్లాసులో కూర్చుని నానా బీభత్సం సృష్టించింది. అర్ధ నగ్నంగా విమానంలో అటు ఇటు తిరగడం ప్రారంభించింది. విమానంలోని సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ఆమె తన సీట్లో కూర్చొకుండా అసభ్యకరంగా ప్రవర్తించింది. ఆమెను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసింది.

విమానం ముంబై చేరుకున్న తర్వాత ఈ విషయమై కెప్టెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటలీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. విమానంలోని ఇతర ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కెప్టెన్ సహా సిబ్బంది మహిళకు నచ్చ చెప్పారని, ఆమె వినకపోగా దురుసుగా ప్రవర్తించడంతో సంస్థ మార్గదర్శకాల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విస్తారా సంస్థ ప్రకటించింది.

First Published:  31 Jan 2023 7:42 AM GMT
Next Story