Telugu Global
National

మాకు ఓటేస్తేనే గ్యారంటీల అమలు.. లేకపోతే రద్దు - కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

కొందరు ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి పేరుతో అక్షింతలు పంచుతున్నారని.. అక్షింతలు కావాలో, హామీల అమలు కావాలో ఎంచుకోవాలని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.

మాకు ఓటేస్తేనే గ్యారంటీల అమలు.. లేకపోతే రద్దు - కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్
X

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే HC బాలకృష్ణ ఐదు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదు గ్యారంటీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మగాడి నియోజవర్గ MLA బాలకృష్ణ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ, కొందరు ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి పేరుతో అక్షింతలు పంచుతున్నారని.. అక్షింతలు కావాలో, హామీల అమలు కావాలో ఎంచుకోవాలని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. దేవాలయాలను గౌరవిస్తాం కానీ.. వాటి పేరుతో ఓట్లు అడగడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు బాలకృష్ణ. ఒకవేళ అక్షింతలు కావాలనుకుంటే.. మేము ఐదు హామీలను రద్దు చేస్తామంటూ కామెంట్స్ చేశారు.

ఈ విషయంపై ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో మట్లాడానన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రజలు అక్షింతలకే ఓటేస్తే.. కాంగ్రెస్‌ ఐదు హామీలను తిరస్కరిస్తున్నట్లేనని సీఎం, డిప్యూటీ సీఎంలకు చెప్పానన్నారు. వాటిని రద్దు చేసి, ఆ డబ్బును అభివృద్ధికి ఉపయోగించాలని వారికి సూచించినట్లు చెప్పారు.

First Published:  31 Jan 2024 11:16 AM GMT
Next Story