Telugu Global
National

ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం

ప్రమాదం జరిగిన వెంటనే కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటికి రాలేకపోయారని స్థానికులు చెబుతున్నారు.

ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం
X

ఉత్తరప్రదేశ్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. భోజిపురా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి అందులోని 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

ప్రమాదం జరిగిన వెంటనే కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటికి రాలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపినట్టు బరేలీ సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సుశీల్‌ చంద్రభాన్‌ ధులే తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

First Published:  10 Dec 2023 5:26 AM GMT
Next Story