Telugu Global
National

అదానీ స్కాం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్ల‌మెంటులో మళ్ళీ నిరసనలు... JPCని డిమాండ్ చేసిన‌ BRS, AAP

సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి

అదానీ స్కాం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్ల‌మెంటులో మళ్ళీ నిరసనలు... JPCని డిమాండ్ చేసిన‌ BRS, AAP
X

అదానీ స్కాం గురించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) సభ్యులు పార్లమెంటులో నిరసనలు చేపట్టారు.

సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి.

ఉభయ సభలు సమావేశమైన వెంటనే, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడి హిండెన్‌బర్గ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కోరాయి. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ చైర్‌ నుంచి స్పందన లేకపోవడంతో వారు సభలో ప్లకార్డులు పట్టుకుని వాకౌట్ చేశారు. బీఆర్‌ఎస్, ఆప్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ, ఆ తర్వాత ఈడీ అరెస్టు చేయగా, ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత వాంగ్మూలాన్ని ఈడీ ఇటీవల నమోదు చేసింది. మార్చి 16న మళ్లీ విచారణ జరగనుంది.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బెదిరింపు వ్యూహాలను అవలంబిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.రాజకీయ కక్షను తీర్చుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయవద్దని సలహా ఇచ్చాయి.

First Published:  13 March 2023 2:04 PM GMT
Next Story