Telugu Global
National

కారులో బీజేపీ నేతల రాసలీలలు.. చెప్పులతో దేహశుద్ధి..

పార్టీ వ్యవహారాల కోసం నాయకులు ఆఫీస్ కి రావడం సహజమే. అయితే వీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి ఆఫీస్ రూమ్ ని కూడా గెస్ట్ హౌస్ లా వాడుకునేవారని ఆరోపణలున్నాయి. ఎవ్వరూ పార్టీ ఆఫీస్ కి రాని సమయంలో వీరిద్దరూ అక్కడికి చేరుకునేవారు.

కారులో బీజేపీ నేతల రాసలీలలు.. చెప్పులతో దేహశుద్ధి..
X

కళ్లు తెరిస్తే శ్రీరామ్, కళ్లు మూస్తే, ఎప్పుడైనా ఎక్కడైనా జై శ్రీరామ్. ఇదీ బీజేపీ నేతల నినాదం. బీజేపీ నేతలంతా శ్రీరాముడి బాటలో నడుస్తారంటే పొరపాటే. కేవలం చెప్పడానికే వారికి నీతులు కనిపిస్తాయి. ఆచరణలో మాత్రం వారు శ్రీరాముడి భావజాలానికి ఆమడదూరంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. దానికి తాజా ఉదాహరణ యూపీలో జరిగింది. యూపీలోని బుందేల్ ఖండ్ కి చెందిన మోహిక్ సౌంకర్ స్థానిక బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సౌంకర్ కు భార్య, పిల్లలు ఉన్నారు. కానీ బుందేల్ ఖండ్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమెకు కూడా భర్త ఉన్నాడు, కానీ ఆమె పర పురుషుడి మాయలో పడింది. ఆయన తన భార్య కళ్లుగప్పి, ఈమె తన భర్తను మభ్యపెట్టి రాసలీలలు సాగిస్తున్నారు.

పార్టీ కార్యాలయంలో కూడా..

పార్టీ వ్యవహారాల కోసం నాయకులు ఆఫీస్ కి రావడం సహజమే. అయితే వీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి ఆఫీస్ రూమ్ ని కూడా గెస్ట్ హౌస్ లా వాడుకునేవారని ఆరోపణలున్నాయి. ఎవ్వరూ పార్టీ ఆఫీస్ కి రాని సమయంలో వీరిద్దరూ అక్కడికి చేరుకునేవారు. కొంతకాలానికి వీరి రాసలీలల వ్యవహారం బయటపడింది. కుటుంబ సభ్యులు నిఘా పెట్టారు. ఇంతలో వీరిద్దరికీ లాంగ్ డ్రైవ్ వెళ్లాలన్న కోరిక కలిగింది, కారులో వెళ్లి పార్టీ చేసుకుని తిరిగొచ్చే క్రమంలో కుటుంబ సభ్యులు చెప్పులతో రెడీగా ఉన్నారు. సౌంకర్ భార్య అతడిని చావగొట్టగా, బిందు భర్త ఆమెపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.

ఛీ ఛీ ఇదేం పాడుపని..

బీజేపీ నేతలు వల్లెవేసే నీతులకి, పార్టీలో జరిగే వ్యవహారాలకి పొంతనే లేదంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. యూపీ బీజేపీ నేతలు చేసిన పాడు పని, దానికి సాక్ష్యంగా దొరికిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోమాత, స్త్రీమూర్తి, రామమార్గం.. అంటూ డైలాగులు చెప్పడమే కానీ, ఆచరణలో బీజేపీ నేతలు అంత సుద్దపూసలేం కాదనే విషయం మరోసారి రుజువైంది. గోమాతను హింసించే వారిని హత్య చేయండని ఆదేశాలిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడో స్త్రీమూర్తి విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించి, ఇల్లాలికి మస్కా కొట్టి రాసలీలలాడుతున్న సొంత పార్టీ నేతల్ని ఏం చేయాలో చెప్పండంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తమ్మీద యూపీ బీజేపీ రాసలీలల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

First Published:  21 Aug 2022 12:35 PM GMT
Next Story