Telugu Global
National

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ... సంజయ్ రౌత్

శనివారం థానెలోలో జరిగిన AIMIM ర్యాలీలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ,ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఎప్పుడు లౌకిక పార్టీగా అవతరించింది? ఆ పార్టీకి ముస్లింల పట్ల సానుభూతి ఎప్పుడు మొదలయ్యింది ? అని ప్రశ్నించారు.

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ... సంజయ్ రౌత్
X

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. శివసేన ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పారు. వీర్ సావర్కర్.. మహారాష్ట్ర లెజెండ్‌ అని కీర్తించారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా, శనివారం థానెలోలో జరిగిన AIMIM ర్యాలీలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ,ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఎప్పుడు లౌకిక పార్టీగా అవతరించింది? ఆ పార్టీకి ముస్లింల పట్ల సానుభూతి ఎప్పుడు మొదలయ్యింది ? షిండే , థాకరే లు రామ్, శ్యామ్ జోడి. మళ్లీ ఎప్పుడు కలిసి వస్తారో మనకే తెలియదు’’ అని అన్నారు.

అసదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన సంజయ్ రౌత్ "బీజేపీ, అసదుద్దీన్ ఒవైసీలు రామ్, శ్యామ్ జోడీ అని అందరికీ తెలుసు" అని వ్యాఖ్యానించారు.

First Published:  26 Feb 2023 12:47 PM GMT
Next Story