Telugu Global
National

దాబాలో పార్టీ.. బిల్ విషయంలో గొడవ.. బర్త్ డే బాయ్ ని చంపేసిన ఫ్రెండ్స్

ఇంటికి వెళ్లిపోయిన సబీర్ ను మేం కూడా పార్టీ ఇస్తాం.. అంటూ స్నేహితులు మళ్లీ రప్పించారు. సబీర్ తో కేక్ కూడా కట్ చేయించారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం పదునైన ఆయుధాలతో సబీర్ పై దాడి చేసి చంపేశారు.

దాబాలో పార్టీ.. బిల్ విషయంలో గొడవ.. బర్త్ డే బాయ్ ని చంపేసిన ఫ్రెండ్స్
X

వాళ్లు ఐదుగురు ఫ్రెండ్స్. అందులో ఒకరిది బర్త్ డే. అతడు దాబాలో ఇచ్చిన పార్టీకి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే బిల్లు కట్టే విషయంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో స్నేహితులు బర్త్ డే బాయ్ ని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబైకి చెందిన సబీర్, షారుఖ్, నిషార్, మరో ఇద్దరు మైనర్లు స్నేహితులు. సబీర్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబాకు ఫ్రెండ్స్ ను తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ బిల్ మొత్తం రూ. 10 వేలు అయింది.

బిల్ అనుకున్న దానికంటే ఎక్కువే కావడంతో ఇంత బిల్ తాను ఒక్కడినే కట్టలేనని సబీర్ స్నేహితులతో అన్నాడు. ఈ విషయమై ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. చివరికి సబీరే బిల్లు మొత్తం చెల్లించాడు. ఆ తర్వాత దాబా వద్ద నుంచి స్నేహితులంతా వెళ్లిపోయారు. అయితే సబీర్ పార్టీ ఇస్తానని చెప్పి పిలుచుకువచ్చి గొడవ పెట్టుకోవడంపై మిగిలిన స్నేహితులు కోపంతో రగిలిపోయారు. సబీర్ ను చంపేయాలని ఆ నలుగురు నిర్ణయించుకున్నారు.

ఇంటికి వెళ్లిపోయిన సబీర్ ను మేం కూడా పార్టీ ఇస్తాం.. అంటూ స్నేహితులు మళ్లీ రప్పించారు. సబీర్ తో కేక్ కూడా కట్ చేయించారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం పదునైన ఆయుధాలతో సబీర్ పై దాడి చేసి చంపేశారు. మే 31వ తేదీ రాత్రి ఈ సంఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఘటనలో ఇద్దరు మైనర్ నిందితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. హత్య తర్వాత షారుఖ్, నిషార్ పరార్ కాగా.. వారిని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  6 Jun 2023 11:32 AM GMT
Next Story