Telugu Global
National

రైలులో మ‌హిళ‌పై అఘాయిత్యం.. - బిడ్డ‌ను రైల్లోంచి విసిరేస్తామ‌ని బెదిరించి దారుణం

బాధిత మ‌హిళ త‌న బిడ్డ‌తో క‌లిసి గువాహ‌టిలో శ‌నివారం మ‌ధ్యాహ్నం రైలెక్కింది. రైలు ఫ‌కీరాగ్రామ్ వ‌చ్చేసరికి దాదాపు ఖాళీ అయింది.

రైలులో మ‌హిళ‌పై అఘాయిత్యం.. - బిడ్డ‌ను రైల్లోంచి విసిరేస్తామ‌ని బెదిరించి దారుణం
X

రైలులో దారుణం చోటుచేసుకుంది. చంటిబిడ్డ‌తో క‌లిసి ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై ఇద్ద‌రు యువ‌కులు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఆమెను క‌ట్టేసి కొట్టి ఈ ఘాతుకానికి దిగారు. త‌మ‌కు స‌హ‌క‌రించక‌పోతే ఆమె బిడ్డ‌ను రైల్లోంచి విసిరేస్తామ‌ని బెదిరించి దారుణానికి ఒడిగ‌ట్టారు. అస్సాంలోని గువాహ‌టి నుంచి ప‌శ్చిమ‌బెంగాల్ లోని అలీపూర్ ద్వార్‌కు వెళ్లే సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

బాధిత మ‌హిళ త‌న బిడ్డ‌తో క‌లిసి గువాహ‌టిలో శ‌నివారం మ‌ధ్యాహ్నం రైలెక్కింది. రైలు ఫ‌కీరాగ్రామ్ వ‌చ్చేసరికి దాదాపు ఖాళీ అయింది. ఈ క్ర‌మంలో అదే బోగీలో ప్ర‌యాణిస్తున్న అస్సాంకు చెందిన అబ్దు (25), మొయినుల్ హ‌క్ (26) ఆమెపై ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. రైలు అలీపూర్‌ద్వార్ జంక్ష‌న్‌కు వ‌చ్చిన అనంత‌రం బాధితురాలు రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంట‌నే గాలింపు చేప‌ట్టి శ‌నివారం రాత్రికి నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

First Published:  8 Aug 2023 3:21 AM GMT
Next Story