Telugu Global
National

ప్రియుడిపై దాడి చేసి బాలికపై సామూహిక అత్యాచారం

పోలీస్ స్టేషన్ కు అని చెప్పి బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లారు. కాళివేలంబట్టి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

ప్రియుడిపై దాడి చేసి బాలికపై సామూహిక అత్యాచారం
X

ప్రియుడిపై దాడి చేసిన కొందరు దుండగులు ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీప ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె కేశవపాళ్యం రోడ్డులో తన ప్రియుడితో మాట్లాడుతుండగా అక్కడికి అన్నా నగర్ కు చెందిన రమేష్ కుమార్, జాన్సన్, ఊంజపాళ్యంకు చెందిన పార్తిబన్ వచ్చారు. రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారంటూ యువకుడి పై దాడికి పాల్పడ్డారు.

ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు అని చెప్పి బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లారు. కాళివేలంబట్టి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు రేప్ చేసే సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. జరిగిన విషయం గురించి ఇంట్లో చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు.

ఆ తర్వాత బాలికను వారు పల్లడం -కోవై రోడ్డులో వదిలి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. గురువారం నిందితులను పల్లడం కోర్టులో హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

First Published:  11 Aug 2023 7:24 AM GMT
Next Story