Telugu Global
National

బీజేపీ మహిళా దినోత్సవం స్పెషల్: బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళపై నోరుపారేసుకున్న బీజేపీ ఎంపీ

మహిళా దినోత్సవం రోజున ఓ బీజేపీ ఎంపీ ఓ మహిళను అందరి ముందు అవమానించాడు. ఎగతాళి చేశాడు. ఇష్టమొచ్చినట్టు ఆమెపై నోరు పారేసుకున్నాడు.

బీజేపీ మహిళా దినోత్సవం స్పెషల్: బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళపై నోరుపారేసుకున్న బీజేపీ ఎంపీ
X

బీజేపీ నేతలు ఎక్కడికెళ్ళినా వారి విద్వేషాన్ని వెంటతీసుకునే వెళ్తారు. వారి పురాతన హిందుత్వ భావజాలాన్ని ఇతరులపై రుద్దడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారికి అధికారం కూడా తోడైతే ఇక పట్టప‌గ్గాలుండవు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నామనే సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తారు. వారి అధికార దర్పంతో అవతలి వాళ్ళను ఎగతాళి చేస్తారు.

మహిళా దినోత్సవం రోజున ఓ బీజేపీ ఎంపీ ఓ మహిళను అందరి ముందు అవమానించాడు. ఎగతాళి చేశాడు. ఇష్టమొచ్చినట్టు ఆమెపై నోరు పారేసుకున్నాడు.

కర్నాటకలోని కోలార్ జిల్లాలోని చన్నైహ మందిరాలో మహిళా దినోత్సవం రోజున బీజేపీ ఎంపీ మునిస్వామి షాపింగ్ మార్కెట్‌ను ప్రారంభించాడు. ఆ సందర్భంగా ఆయనకు ఓ షాపులో ఉన్న మహిళ బొట్టు పెట్టుకోకుండా కనిపించింది. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన ఎంపీ ఆ మహిళ మీద ఇష్టమొచ్చిన రీతిలో అరిచాడు. ''నీ భర్త బతికే ఉన్నాడు కదా బొట్టు ఎందుకు పెట్టుకోలేదు'' అని ఆగ్రహంగా ప్రశ్నించాడు.''అసలు నీకు ఇక్కడ షాపు పెట్టుకోవాడానికి అనుమతిచ్చిందెవరు ? షాపు పేరు వైష్ణవి అని పెట్టుకొని నువ్వు బొట్టుపెట్టుకోవా ? బొట్టు పెట్టుకోవద్దని ఎవరైనా నీకు డబ్బులిచ్చారా ? ముందు బొట్టు పెట్టుకో. కామన్ సెన్స్ లేదు. '' అని ఆ మహిళ మీద అరిచి పక్కనున్న మరో మహిళతో .''హే ఆ మహిళకు బొట్టు ఇవ్వు'' అని కోపంగా చెప్పాడు.

.

బీజేపీ ఎంపీ మహిళపై నోరు పారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజనులు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పలువురు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనాయకులు మహిళలపై మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం విరుచుకపడ్డారు.

First Published:  9 March 2023 11:22 AM GMT
Next Story