Telugu Global
National

యోగీ రాజ్యంలో రెచ్చి పోతున్న మాఫియా!

ఉత్తరప్రదేశ్ లో నిన్న ఇసుక మాఫియా హల్ చల్ సృష్టించింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు టోల్ ప్లాజా బారికేడ్లను బద్దలు కొడుతూ దూసుక‌పోయాయి.

యోగీ రాజ్యంలో రెచ్చి పోతున్న మాఫియా!
X

ఉత్తరప్రదేశ్ లో ఒక వైపు ప్రభుత్వమే బుల్డోజర్లతో ప్రైవేటు ఆస్తులపై దాడులు చేస్తూ ఉంటే మరో వైపు అనేక రకాల మాఫియాలు కూడా రెచ్చిపోతున్నాయి. ఉమెన్ ట్రాఫికింగ్ మాఫియా, మనుషుల అవయాల మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా....ఇలా అనేక మాఫియాలు రాజ్యం చెలాయిస్తున్నారు. కొందరికి రాజకీయ నాయకుల అండదండలున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

నిన్న ఆగ్రాలో ఇసుక మాఫియా సృష్టించిన హల్ చల్ చూసి జనం బిక్కచచ్చిపోయారు. ఆగ్రా గ్వాలియర్ హైవేపై ఉన్న జజౌ టోల్ ప్లాజా వద్ద ఇసుక మాఫియాకు చెందిన 12 ఇసుక ట్రాక్ట్రర్లు టొల్ ప్లాజా బారికేడ్లను బద్దలు కొడుతూ దూసుకపోయిన తీరు టోల్ ప్లాజా సిబ్బందిని షాక్ కు గురి చేసింది.

మొదటి ట్రాక్టర్ బారికేడ్ ను బద్దలు కొట్టి దూసుకొని వెళ్ళిపోయిన 52 సెకన్లలో మొత్తం 12 ట్రాక్టర్లు బారికేడ్లను ఢీకొట్టి వేళ్ళిపోయాయి. వాటిని ఆపేందుకు టోల్ ప్లాజా సిబ్బంది కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేసినా ఏ ఫలితమూ దక్కలేదు.

ఈ సంఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



First Published:  5 Sep 2022 10:27 AM GMT
Next Story