Telugu Global
National

JNUలో కలకలం..గోడలపై 'బ్రాహ్మణ్ భారత్ చోడో' నినాదాలు

JNU స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గోడలపై బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా నినాదాలు కనిపించాయి. గోడలపై “బ్రాహ్మణులు భారత్ ని విడిచిపెట్టండి”, “బ్రాహ్మణులు-బనియాలు, మేము మీ కోసం వస్తున్నాము! మీరు తప్పించుకోలేరు" వంటి నినాదాలు రాశారు.

JNUలో కలకలం..గోడలపై బ్రాహ్మణ్ భారత్ చోడో నినాదాలు
X

ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో మరోసారి వివాదం చెలరేగింది, ఈసారి యూనివర్సిటీ క్యాంపస్‌లోని అనేక భవనాల గోడలు బ్రాహ్మణ, బనియా వ్యతిరేక నినాదాలతో నిండిపోయాయి.

JNU స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గోడలపై బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా నినాదాలు కనిపించాయి.

గోడలపై "బ్రాహ్మణులు భారత్ ని విడిచిపెట్టండి", "బ్రాహ్మణులు-బనియాలు, మేము మీ కోసం వస్తున్నాము! మీరు తప్పించుకోలేరు" వంటి నినాదాలు రాశారు.

దీనిపై యూనివర్శిటీకి చెందిన పలు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గోడలపై ఇలాంటి రాతలు రాయడాన్ని ఖండించిన వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ డీ పండిట్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

జేఎన్‌యూ క్యాంపస్‌లో బ్రాహ్మణ, బనియా వ్యతిరేక నినాదాలతో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ క్యాబిన్ డోర్‌పై 'మీ శాఖకు తిరిగి వెళ్ళండి' అనే నినాదం రాసి ఉంది.

ఈ నినాదాలు నవంబర్ 30 రాత్రి వ్రాయబడ్డాయని తెలుస్తోంది. ఈ విషయంపై విశ్వవిద్యాలయ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. దీంట్లో ప్రమేయం ఉన్నవారిని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏబీవీపీ అధ్యక్షుడు రోహిత్ కుమార్ తెలిపారు. ఈ చర్యకు వామపక్ష భావజాలంతో సంబంధం ఉన్న విద్యార్థులే కారణమని, వారు జెఎన్‌యు గోడలపై ఈ అసభ్యకరమైన రాతలను రాశారని అన్నారు. ఇందులో వామపక్షం - AISA ప్రమేయం ఉందని కుమార్ ఆరోపించారు.

అయితే, AISAకి సంబంధించిన విద్యార్థులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

JNU స్టూడెంట్స్ యూనియన్ సభ్యుడు,మాజీ అధ్యక్షుడు N. సాయి బాలాజీ ఈ సంఘటనలో వామపక్షాల ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఖండించారు. అయితే ఇది ఏబీవీపీ కార్యకర్తల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు


First Published:  2 Dec 2022 8:26 AM GMT
Next Story