Telugu Global
National

నాపై విషప్రయోగం చేశారు.. - మన్సూర్‌ అలీఖాన్‌ సంచలన ఆరోపణలు

కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారని వివరించారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నానని తెలిపారు.

నాపై విషప్రయోగం చేశారు.. - మన్సూర్‌ అలీఖాన్‌ సంచలన ఆరోపణలు
X

తనపై విష ప్రయోగం చేశారని కోలీవుడ్‌ నటుడు, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన్సూర్‌ అలీఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలు చేసిన ప్రకటనను ఆయన సన్నిహితులు తాజాగా మీడియాకు విడుదల చేశారు. తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నవేళ మన్సూర్‌ అలీఖాన్‌ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ బుధవారం వేలూరు పరిసర ప్రాంతాల్లో కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్‌ను తాగించారు. ఆ తర్వాత మజ్జిగ కూడా తాగించడంతో ఆయన కడుపునొప్పితో వెంటనే కింద పడిపోయారు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై మన్సూర్‌ అలీఖాన్‌ స్పందించిన ప్రకటనను ఆయన సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారని వివరించారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నానని తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్‌ అలీఖాన్‌ చెప్పారు.

First Published:  19 April 2024 6:05 AM GMT
Next Story