Telugu Global
National

మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్న లారెన్స్‌.. - 150 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకున్న వైనం

త‌న కొత్త సినిమా `రుద్ర‌న్‌` ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆయ‌న ఆ చిన్నారుల‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుండే లారెన్స్ ఇప్ప‌టికే అనేక‌మంది చిన్నారుల‌కు సాయం చేశారు.

మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్న లారెన్స్‌.. - 150 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకున్న వైనం
X

ఇప్ప‌టికే త‌న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్న సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నృత్య ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. లారెన్స్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తాజాగా 150 మంది చిన్నారుల‌ను ఆయ‌న ద‌త్త‌త తీసుకున్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న మంగ‌ళ‌వారం వెల్ల‌డిస్తూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ద‌త్త‌త తీసుకున్న చిన్నారుల‌కు నాణ్య‌మైన విద్య అందించేందుకు కృషిచేస్తాన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

త‌న కొత్త సినిమా `రుద్ర‌న్‌` ప్రీ రిలీజ్ వేడుక‌లో ఆయ‌న ఆ చిన్నారుల‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుండే లారెన్స్ ఇప్ప‌టికే అనేక‌మంది చిన్నారుల‌కు సాయం చేశారు. తాజాగా 150 మంది చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకొని ఆయ‌న మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

చెన్నైలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవ‌రైనా ఆర్థిక స‌మ‌స్య కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతుంటే.. ఎవ‌రికైనా గుండె శ‌స్త్ర చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డితే.. లారెన్స్ చారిట‌బుల్ ట్ర‌స్టును సంప్ర‌దించాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

First Published:  12 April 2023 2:39 AM GMT
Next Story