Telugu Global
National

ఫోన్ కోసం ప్రాణం తీసి .. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌కి బలయ్యాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీటెక్ విద్యార్థిని కీర్తి సింగ్ ఫోన్ కొట్టేసే ప్రయత్నంలో ఆమె మరణానికి కారణమైన రెండో నిందితుడు తాజాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

ఫోన్ కోసం ప్రాణం తీసి .. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌కి బలయ్యాడు
X

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీటెక్ విద్యార్థిని కీర్తి సింగ్ ఫోన్ కొట్టేసే ప్రయత్నంలో ఆమె మరణానికి కారణమైన రెండో నిందితుడు తాజాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మృతుని పేరు జితేంద్ర కాగా అతనిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నాయి.

సంఘటన వివరాల్లోకి వెళితే ..

అక్టోబర్ 27న కీర్తి సింగ్ తన స్నేహితురాలు దీక్షతో కలిసి కాలేజీ నుంచి ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఢిల్లీ-లక్నో హైవేపై ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాస్నా ఫ్లైఓవర్ సమీపంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అగంతకులు ఆమె వెళుతున్న ఆటోను వెంబడించారు.

ఆటో పక్కగా బైక్ స్లో చేసి కీర్తి చేతిలోని మొబైల్ లాక్కోవడం మొదలుపెట్టాడు. కీర్తి తన మొబైల్‌ని వదలకుండా తీవ్రంగా ప్రతిఘటించింది . దీంతో నిందితులు ఆమె చేయి పట్టుకొని బయటకు లాగారు. కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఆపై మొబైల్ లాక్కుని పారిపోయారు. రన్నింగ్ ఆటో నుంచి కిందపడడంతో గాయాలపాలైన కీర్తిని ఆసుపత్రిలో చేర్పించారు.


ఆమె శరీరంపై , తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కీర్తి మృతి చెందింది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొబైల్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలను గుర్తించిన పోలీసులు.. వారి కోసం వేట ప్రారంభించారు. ఒక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించి రెండో నిందితుడు జితూ కోసం తీవ్రంగా గాలించారు.

ఈ నేపథ్యంలో ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జితూ ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో జితూ గంగానాహర్ ట్రాక్ పై పరుగులు పెట్టాడు. పోలీసుల పై దాడికి ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో జితూ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు.


First Published:  30 Oct 2023 7:01 AM GMT
Next Story