Telugu Global
National

గ‌డ్డి కోసం గొడ‌వ‌.. ఇరువ‌ర్గాల దాడుల్లో ఐదుగురు మృతి

దతియా జిల్లాలోని రెండా గ్రామంలో ప్రకాశ్ దంగి, ప్రీతం పాల్ అనే వ్యక్తుల మధ్య పశుగ్రాసం విషయంలో మూడు రోజుల క్రితం గొడవ జరిగింది.

గ‌డ్డి కోసం గొడ‌వ‌.. ఇరువ‌ర్గాల దాడుల్లో ఐదుగురు మృతి
X

ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ప‌శుగ్రాసం విష‌యంలో త‌లెత్తిన గొడ‌వ.. రెండు వ‌ర్గాల మ‌ధ్య కుంప‌టి రేపింది. మూడు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌నకు సంబంధించి ఇరువ‌ర్గాల వారూ పోలీసు కేసుల వ‌ర‌కూ వెళ్లారు. బుధ‌వారం మ‌రోసారి వీరిమ‌ధ్య గొడ‌వ చెల‌రేగి.. ఇరు వ‌ర్గాల వారూ కాల్పుల‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతిచెంద‌గా, మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

దతియా జిల్లాలోని రెండా గ్రామంలో ప్రకాశ్ దంగి, ప్రీతం పాల్ అనే వ్యక్తుల మధ్య పశుగ్రాసం విషయంలో మూడు రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రీతంను ప్రకాశ్ చెంపదెబ్బ కొట్టాడు. దీనిపై దంగి, పాల్ వర్గాల వారు పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు ఈ కేసుల్లో ద‌ర్యాప్తు చేస్తూ ఇరువర్గాల మ‌ధ్య ఆగ్ర‌హావేశాలు త‌గ్గించి.. సామ‌రస్యం పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ఇంత‌లోనే బుధ‌వారం మ‌రోసారి రెండు వ‌ర్గాల వారూ గొడ‌వ ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రుపుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతిచెంద‌గా, 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  14 Sep 2023 12:00 AM GMT
Next Story