Telugu Global
National

కేజీఎఫ్ హీరో బర్త్ డే వేడుకల్లో అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి

యశ్ పుట్టినరోజు వేడుకలను భారీస్థాయిలో నిర్వహించాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యశ్ జన్మదిన వేడుకలు జరిపారు. గడగ్ లో యశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ బ్యానర్ చేయించారు.

కేజీఎఫ్ హీరో బర్త్ డే వేడుకల్లో అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి
X

కన్నడ స్టార్ యాక్టర్, కేజీఎఫ్ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. భారీ బ్యానర్ కడుతుండగా కరెంటు షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గడగ్ జిల్లాలో జరిగింది.

సోమవారం యశ్ పుట్టినరోజు కాగా.. వేడుకలను భారీస్థాయిలో నిర్వహించాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యశ్ జన్మదిన వేడుకలు జరిపారు. గడగ్ లో యశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ బ్యానర్ చేయించారు. దీనిని 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు బ్యానర్ ను తాకాయి. బ్యానర్ కు విద్యుత్తు ప్రసారం కావడంతో దానిని పట్టుకొని ఉన్న ఆరుగురు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. వారిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. మృతి చెందిన అభిమానులు హనుమంత మజ్జురప్ప(20), మురళీ నీలప్ప(20), నవీన నీలప్ప(19)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై యశ్ స్పందించాల్సి ఉంది.

తన బర్త్ డే సందర్భంగా నాలుగు రోజుల కిందటే అభిమానులను ఉద్దేశించి యశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన పుట్టినరోజున అభిమానులు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెప్పేందుకు ఆశపడుతుంటారని, తనకు కూడా అభిమానులతో గడపాలని ఉందని, అయితే జనవరి 8న తాను అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. సినిమా పనుల కారణంగా మరో ప్రాంతానికి వెళ్తున్నానని, అందరం మరోసారి కలుద్దామని పోస్ట్ చేశారు.

First Published:  8 Jan 2024 11:28 AM GMT
Next Story