Telugu Global
National

క‌న్న‌బిడ్డ పాలిట తండ్రే య‌ముడు..

శ‌నివారం ఉద‌యం ప‌ట్ట‌రాని ఆగ్ర‌హానికి గురైన బాలిక తండ్రి ఆమెను గొడ్డ‌లితో న‌రికి హ‌త‌మార్చాడు. అత‌నికి కుమారులు రాధేశ్యామ్‌, ఘ‌న‌శ్యామ్‌లు కూడా స‌హ‌క‌రించారు.

క‌న్న‌బిడ్డ పాలిట తండ్రే య‌ముడు..
X

క‌న్న కూతురిని తండ్రే య‌ముడై హ‌త‌మార్చిన దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ముజ‌ఫ‌ర్‌పూర్‌లో శ‌నివారం చోటుచేసుకుంది. కుటుంబ స‌భ్యులు వద్దని చెప్పినా వినకుండా పరాయి వ్యక్తితో మాట్లాడుతోందన్నదే కార‌ణం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. తిక్రీ గ్రామానికి చెందిన బాలిక (17) అదే గ్రామంలోని ఒక వ్య‌క్తితో త‌ర‌చూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. కుటుంబ స‌భ్యులు ఈ విష‌యం గ‌మ‌నించి ఆమెను గ‌ట్టిగా హెచ్చ‌రించారు. అత‌నితో మాట్లాడవ‌ద్ద‌ని చెప్పారు. అయినా ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో గ‌త కొన్ని రోజులుగా ఇదే విష‌య‌మై వారి ఇంట్లో గొడ‌వ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బాలిక తండ్రి.. ఆమె తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాడు.

ఈ క్ర‌మంలోనే శ‌నివారం ఉద‌యం ప‌ట్ట‌రాని ఆగ్ర‌హానికి గురైన బాలిక తండ్రి ఆమెను గొడ్డ‌లితో న‌రికి హ‌త‌మార్చాడు. అత‌నికి కుమారులు రాధేశ్యామ్‌, ఘ‌న‌శ్యామ్‌లు కూడా స‌హ‌క‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బ్రిజేష్‌కుమార్ శ్రీ‌వాత్స‌వ తెలిపారు.

*

First Published:  27 Aug 2023 3:12 AM GMT
Next Story