Telugu Global
National

తరగతి గదిలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. తోటి విద్యార్థులే నిందితులు..

అత్యాచారానికి పాల్పడ్డ విద్యార్థులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

తరగతి గదిలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. తోటి విద్యార్థులే నిందితులు..
X

దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అయితే నిండా 15 సంవత్సరాలు కూడా నిండని విద్యార్థులు కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌లో మైనర్ బాలికపై సహచర విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. ఇప్పుడు ముంబైలో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఇద్దరు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. తరగతి గదిలోనే ఈ సంఘటన జరగడంతో అంతా నివ్వెరపోతున్నారు.

ఈ ఘటన గత సోమవారం జరుగగా శుక్రవారం ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ముంబైలోని ఓ పాఠశాలలో సోమవారం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం తరగతి గది నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఓ విద్యార్థిని మాత్రం క్లాస్ రూమ్‌లోనే ఉండిపోయింది. అది గమనించిన అదే తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తరగతి గదిలోనే తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడడంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక ఇంటికి వెళ్ళిన తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ విద్యార్థులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. కేవలం 13 ఏళ్ల వయసు ఉన్న‌ బాలురు తరగతి గదిలో అత్యాచారానికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నేర సంస్కృతి ఎంతలా పెరిగిపోయిందో తెలియజేస్తోంది.

First Published:  2 Dec 2022 9:29 AM GMT
Next Story