Telugu Global
National

11 ఏళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసుకుంటూ పైశాచికత్వం

ఆదివారం మధ్యాహ్నం పని వెతుక్కునేందుకు త‌ల్లి బ‌య‌ట‌కు వెళ్లగా బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు దీనిని గమనించారు.

11 ఏళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసుకుంటూ పైశాచికత్వం
X

త్రిపుర రాష్ట్రం ఉత్తర త్రిపుర జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ చేస్తున్న సమయంలో వీడియోలు తీస్తూ పైశాచికత్వం ప్రదర్శించారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. ధర్మనగర్ సబ్ డివిజనల్ పరిధిలోని కదంతలా ప్రాంతంలో ఓ మహిళ 11 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త కొద్ది రోజుల కిందట నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో మహిళ జీవనోపాధి కోసం పని వెతుక్కుంటోంది.

ఆదివారం మధ్యాహ్నం పని వెతుక్కునేందుకు త‌ల్లి బ‌య‌ట‌కు వెళ్లగా బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు దీనిని గమనించారు. ఇంట్లోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో తమ సెల్ ఫోన్లలో లో వీడియోలు కూడా తీసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన దారుణం గురించి ఆ బాలిక‌ వివ‌రించింది. దీంతో బాధితురాలి త‌ల్లి ధర్మ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేషన్ ఇన్చార్జి సుబిర్ మలకార్ సంఘటనా స్థలానికి వెళ్లారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సోమవారం రాజేంద్రనగర్ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు తెలుసుకొని వారిని అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు పదహారేళ్ళ వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు.

First Published:  30 May 2023 7:40 AM GMT
Next Story