Telugu Global
NEWS

ఏపీలో టీడీపీపై గురిపెట్టిన కేసీఆర్‌

ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్‌ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్‌ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఏపీలో టీడీపీపై గురిపెట్టిన కేసీఆర్‌
X

దసరా రోజు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్‌.. తమపై గురి పెట్టారని టీడీపీ ఆందోళనగా ఉంది. ఏపీలోని టీడీపీ నేతలను జాతీయ పార్టీలోకి చేర్చుకునేందుకు కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారని టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.

గతంలో టీడీపీలో సుధీర్ఘకాలం పనిచేసిన కేసీఆర్‌ ప్రస్తుతం టీడీపీలో ఉన్న తన మిత్రులకు గాలం వేస్తున్నారని టీడీపీ మీడియానే చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్‌ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్‌ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సానుకూలంగా స్పందించినట్టు.. త్వరలోనే భారీగా ఏపీలోని టీడీపీ నుంచి వలసలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయని మీడియాలో కథనాలు. టీడీపీ కొద్దిగా బలంగా ఉన్నది ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అని.. అక్కడ కేసీఆర్ ఫోకస్ పెడితే అది టీడీపీకే నష్టమని ఆ పార్టీ అంచనాలు వేస్తోంది. టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర సీనియర్ నేతలకు కేసీఆర్‌ ఆహ్వానాలు పంపుతున్నారని.. టీడీపీ అనుకూల ప్రధాన టీవీ చానలే చెబుతున్న నేపథ్యంలో మునుముందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.

First Published:  3 Oct 2022 2:54 PM GMT
Next Story