Telugu Global
International

వోడాఫోన్ కఠిన నిర్ణయం.. 11వేల ఉద్యోగాలకు మంగళం

ప్రపంచ వ్యాప్తంగా వోడాఫోన్ కంపెనీలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 11వేల మందిని తొలగిస్తున్నారంటే 10శాతం కంటే ఎక్కువమందినే ఇంటికి పంపిస్తారనమాట.

వోడాఫోన్ కఠిన నిర్ణయం.. 11వేల ఉద్యోగాలకు మంగళం
X

ఒకప్పుడు మొబైల్ ఆపరేటర్ల విభాగంలో ఓ వెలుగు వెలిగిన వోడాఫోన్ కంపెనీ.. ఇప్పుడు భారత్ లో ఐడియాతో కలసి వీఐగా ఉనికి కాపాడుకొంటోంది. మళ్లీ పునర్వైభవానికి ప్రయత్నిస్తున్నామని చెబుతోన్న యాజమాన్యం.. 11వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించి షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్నవారిలో.. రాబోయే మూడేళ్లలో 11వేలమంది ఉద్యోగులను తొలగిస్తామని చెప్పింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా వోడాఫోన్ కంపెనీలో పనిచేసే వారిలో దాదాపు 10శాతం మంది బెంచ్ పై ఉన్నట్టే లెక్క. ఉద్యోగాల్లో భారీ కోత పెట్టబోతున్న వోడఫోన్ విస్తరణ ప్రణాళిక ఎలా రచిస్తుందో తేలాల్సి ఉంది.

కంపెనీని విస్తరిస్తున్నాం, మిగతా కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఎవరైనా చెబితే.. పెట్టుబడులు తెస్తారు, ఉద్యోగుల్ని పెంచుకుంటారని అనుకుంటాం. కానీ వోడాఫోన్ మాత్రం ఉద్యోగుల్ని తొలగిస్తూనే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందిస్తామంటోంది. సంస్కరణల అమలులో భాగంగా తొలగింపు తప్పదని తేల్చి చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా వోడాఫోన్ కంపెనీలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 11వేల మందిని తొలగిస్తున్నారంటే 10శాతం కంటే ఎక్కువమందినే ఇంటికి పంపిస్తారనమాట. ఇటీవల కాలంలో ఈస్థాయిలో ఉద్యోగుల్ని ఏ కంపెనీ తొలగించలేదు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురవుతుందనడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. వీలైనంతగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోడానికే కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

First Published:  17 May 2023 5:13 AM GMT
Next Story