Telugu Global
International

మాలీలో కూలిన బంగారు గని 70 మంది మృతి

మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిన ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు.

మాలీలో కూలిన బంగారు గని 70 మంది మృతి
X

మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిన ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు. గనిలో చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మాలిలోని నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ప్రభుత్వ జాతీయ జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్‌ అధికారి తెలిపారు. అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఈ దారుణం జరిగినట్లు వారు ధృవీకరించారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఆఫ్రియాలోని మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. మారుమూల ప్రాంతాలలో భద్రతా చర్యలను పాటించకుండా, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతుండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. దీంతో గోల్డ్ మైన్స్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తరచుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.


అధికారులు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని తరచుగా ఆరోపిస్తున్నారు.అయితే.. ఈసారిభారీ ప్రమాదం చోటు చేసుకుంది. తాజా సంఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు.

బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు.. గనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో నివసించే మైనర్లు, ప్రజలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.


ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి, ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మాలి 2022లో 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌, ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి.

First Published:  25 Jan 2024 6:52 AM GMT
Next Story