Telugu Global
International

శ్రీలంక చేతిలో ఓటమి...ఆసియా కప్ నుంచి టీమిండియా ఔట్

శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.

శ్రీలంక చేతిలో ఓటమి...ఆసియా కప్ నుంచి టీమిండియా ఔట్
X

ఆసియా కప్ లో శ్రీకంక చేతిలో 6 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. భారత్ విధించిన 174 ల పరుగుల టార్గెట్ ను శ్రీలంక 4 వికెట్ల నష్టానికే చేదించింది. డూ అండ్ డై గేమ్ లో రోహిత్ సేన ప్లాప్ షో ప్రదర్శించింది.

భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత్ జట్టులో రోహిత్ శర్మ సూర్య కుమార్ తప్ప మిగతావాళ్ళంతా పేలవమైన పర్ ఫార్మ్ర్న్స్ ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ ఏకంగా డకౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో చహల్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

ఇక శ్రీలం క ఇన్నిం గ్స్ లో పాతుమ్ నిసాంక 52, కుషాల్ మెండిస్ 57 పరుగులు చేయగా.. చివర్లో దాసున్ షనక 33, బానుక రాజపక్స 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి లంకకు విజయమందించారు.

First Published:  6 Sep 2022 2:30 PM GMT
Next Story