Telugu Global
International

ఆఫ్ఘాన్‌లో మ‌రో భారీ భూకంపం.. భ‌యంతో జ‌నం ప‌రుగులు

ఈ ఏడాది వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వ‌ణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్‌ పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆఫ్ఘాన్‌లో మ‌రో భారీ భూకంపం.. భ‌యంతో జ‌నం ప‌రుగులు
X

ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఆస్తి, ప్రాణ నష్టం విషయంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఈ ఏడాది వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వ‌ణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్‌ పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.




అంతకు ముందు అక్టోబర్‌ 7న సంభవించిన వరుస నాలుగైదు భూకంపాల కారణంగా దాదాపు 4 వేల మందికిపైగా మరణించారు. 20 గ్రామాల్లో దాదాపు 2 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తరువాత కొద్దీ రోజుల వరకు తిండి, ఆశ్రయం లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితిలో అనేక దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేశాయి.



ఆ విషాదం మ‌రువ‌క ముందే మరోసారి అక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం గుర్తించారు. అయితే ఈ భూకంపంలో ప్రాణనష్టం వివరాలు బయటకు రాలేదు. ఇక జూన్ 22న సైతం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 300 మందికి పైగా మరణించారు.

First Published:  12 Dec 2023 9:44 AM GMT
Next Story