Telugu Global
International

క్రూజ్‌లో కోవిడ్ క‌ల‌క‌లం.. - 800 మంది ప్ర‌యాణికుల‌కు కోవిడ్ పాజిటివ్‌

ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల స‌ముద్ర‌యానం మ‌ధ్య‌లో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియ‌డంతో క్రూజ్‌లో ఉన్న‌వారు, అధికారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

క్రూజ్‌లో కోవిడ్ క‌ల‌క‌లం.. - 800 మంది ప్ర‌యాణికుల‌కు కోవిడ్ పాజిటివ్‌
X

కోవిడ్ అదుపులోకి వ‌చ్చింద‌ని, ఇక భ‌య‌పడాల్సిందేమీ లేద‌ని భావిస్తున్న త‌రుణంలో ఎక్క‌డో ఒక‌చోట ఏదో ఒక ఉదంతం బ‌య‌ట‌ప‌డుతూ ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.. క‌ల‌వ‌రం రేపుతుంది. తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రూజ్ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు. దీనికి కార‌ణం.. మొత్తం 4,600 మంది ప్ర‌యాణికులు, సిబ్బందితో వెళుతున్న ఈ క్రూజ్‌లో 800 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులు ఉండ‌ట‌మే.

ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల స‌ముద్ర‌యానం మ‌ధ్య‌లో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియ‌డంతో క్రూజ్‌లో ఉన్న‌వారు, అధికారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో ఈ క్రూజ్‌ను సిడ్నీ తీరంలో నిలిపివేశారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న‌వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి, త‌గిన స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. క్రూజ్ ఆప‌రేట‌ర్ సంస్థ `కార్నివాల్‌-ఆస్ట్రేలియా.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ క్రూజ్ త్వ‌ర‌లోనే మెల్‌బోర్న్ చేరుకోనుంది.

2020లో ప్ర‌పంచ మంత‌టా కోవిడ్ విస్త‌రించిన స‌మ‌యంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే ఈ సంస్థ నిర్వ‌హిస్తున్న ఓ `రూబీ ప్రిన్సెస్ క్రూజ్‌`లో వెలుగుచూసింది. అప్ప‌ట్లో 900 మంది కోవిడ్ బారిన ప‌డ‌గా.. వారిలో 28 మంది మ‌ర‌ణించారు. ఆస్ట్రేలియాలో ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. వారంలో 19,800 కేసులు వెలుగు చూశాయంటే.. అక్క‌డ ప‌రిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవ‌చ్చు.

First Published:  13 Nov 2022 2:45 AM GMT
Next Story