Telugu Global
International

ప‌ట్ట‌ప‌గ‌లు.. న‌డిరోడ్డుపై.. కూలిన విమానం

ఇద్ద‌రు పైలెట్ల‌తో గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌లుదేరిన ఒక చిన్న విమానం.. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

ప‌ట్ట‌ప‌గ‌లు.. న‌డిరోడ్డుపై.. కూలిన విమానం
X

ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై ఓ విమానం కుప్ప‌కూలిపోయింది. మలేసియా సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలో గురువారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది మృతిచెందినట్టు అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

లంగ్‌కావి ద్వీపం నుంచి ఆరుగురు ప్ర‌యాణికులు, ఇద్ద‌రు పైలెట్ల‌తో గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌లుదేరిన ఒక చిన్న విమానం.. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివ‌ల్ల విమానం అదుపుత‌ప్పి గాలిలోనే అస్త‌వ్యస్తంగా గింగిరాలు తిరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే అది నేల కూలింది.

విమానం కూలిన ప్ర‌మాదంలో 8 మంది మృతిచెంద‌గా, ర‌హ‌దారిపై కారులో వెళుతున్న ఒక వ్య‌క్తి, బైక్‌పై వెళ్తున్న మ‌రో వ్య‌క్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సెంట్రల్ పహాంగ్ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్ బోర్డు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై భారీగా మంట‌లు వెలువడి, పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది.

First Published:  18 Aug 2023 1:47 AM GMT
Next Story