Telugu Global
NEWS

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం

మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే చాలా మంది భారతీయ ప్రముఖుల మైనపు బొమ్మలను ప్రదర్శించారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం
X

పుష్ప-ది రైజ్‌ సినిమాలో త‌న నటనతో నేషనల్‌ అవార్డును సొంతం చేసుకున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత దక్కించుకోనున్నాడు. ప్రస్తుతం పుష్ప-2 ది రూల్‌ మూవీ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న స్టైలిష్‌ స్టార్.. ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకోనున్నాడు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

సౌత్ ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన మూడో నటుడిగా అల్లు అర్జున్ నిలవనున్నాడు. ఇప్పటికే బాహుబలి ఫేమ్‌ ప్రభాస్‌, స్పైడర్‌ మహేష్‌ బాబుల మైనపు బొమ్మలు టుస్సాడ్స్‌లో ప్రదర్శించారు. ఇందుకోసం కొలతలు ఇచ్చేందుకు అల్లు అర్జున్‌ త్వరలోనే లండన్‌ వెళ్లనున్నాడని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే చాలా మంది భారతీయ ప్రముఖుల మైనపు బొమ్మలను ప్రదర్శించారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

అల్లు అర్జున్ విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప-2 ది రైజ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  20 Sep 2023 11:10 AM GMT
Next Story