Telugu Global
NEWS

నేనేతప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవాలి.. సమంత సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్

వివాహ బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది కలిసి రాలేదు. అటువంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కుకోవాలి.. అనిపించింది.

నేనేతప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవాలి.. సమంత సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్
X

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత వైవాహిక జీవితంపై ఎప్పుడుగా నేరుగా స్పందించని సమంత తొలిసారి స్పందించింది. తాను వైవాహిక జీవితంలో వంద శాతం పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా వర్కౌట్ కాలేదని ఆమె వ్యాఖ్యానించింది. 2017లో నాగచైతన్య -సమంత పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటినుంచి సమంత విడాకులు ఎందుకు తీసుకువలసి వచ్చిందో నేరుగా ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పుడప్పుడు నాగచైతన్యపై పరోక్షంగా విమర్శలు చేసేది.

అయితే తొలిసారి ఆమె తన వైవాహిక బంధంపై స్పందించింది. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె తన వివాహం, విడాకుల గురించి మాట్లాడింది. 'చైతూతో విడాకులు తీసుకున్న వెంటనే నాకు పుష్ప సినిమాలో 'ఊ అంటావా మామ' అనే పాట ఆఫర్ వచ్చింది. అయితే చాలామంది ఆ పాటలో న‌టించొద్దు అని నాకు చెప్పారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు ఫోన్ చేసి ఇంట్లో కూర్చో చాలు. విడాకులు తీసుకున్న వెంటనే ఐటెం సాంగ్స్ చేయడం బాగోదు. చెడుగా అనుకుంటారు అని సలహాలు ఇచ్చారు.

కానీ, నేను దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే.. వివాహ బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది కలిసి రాలేదు. అటువంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కుకోవాలి.. అనిపించింది. నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకోవడం, బాధపడటం ఎందుకు అనిపించింది. అందుకే ఆ సాంగ్ లో చేసేందుకు ఓకే చెప్పాను.' అని సమంత వివ‌రించింది. చైతూతో విడాకుల తర్వాత సమంత పైనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఆమె తీరు వల్లే నాగచైతన్య విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే తొలిసారి సమంత తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేసింది. తన వైవాహిక బంధంపై సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారాయి.

First Published:  29 March 2023 12:42 PM GMT
Next Story