Telugu Global
NEWS

నేనింకా చావ‌లేదు ప్లీజ్‌- సమంత క‌న్నీళ్లు

సుమ యాంకర్‌గా వ్యహరించిన ఈ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాన‌ని, చావుకు ద‌గ్గ‌ర‌య్యాన‌ని కూడా కొంత‌మంది రాశారు. నేనింకా చావ‌లేదు ప్లీజ్'' అంటూ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంది.

నేనింకా చావ‌లేదు ప్లీజ్‌- సమంత క‌న్నీళ్లు
X

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. ఈ సమయంలోనే ఆమె తాజా చిత్రం 'యశోద' (Yashoda) మూవీ పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11న విడుదలకి సిద్ధమైంది. మ‌యోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే ఎంతో కష్టపడి సెలైన్ పెట్టుకుని మరి ఈ సినిమా డబ్బింగ్‌ని పూర్తి చేసింది స‌మంత‌. సామ్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె బయటికి రావడమే కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ సామ్ 'యశోద' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.

సుమ యాంకర్‌గా వ్యహరించిన ఈ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాన‌ని, చావుకు ద‌గ్గ‌ర‌య్యాన‌ని కూడా కొంత‌మంది రాశారు. నేనింకా చావ‌లేదు ప్లీజ్'' అంటూ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంది. యశోదకి తనకి పోలికలను ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. 'యశోదకి నాకు చాలా పోలికలు ఉన్నాయి. నాలాగే యశోద కూడా పెద్ద కలలతో సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. మాకు పట్టుదల ఎక్కువ. అలాగే.. నాలాగే య‌శోద కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్ని గెలవగలిగింది' అని చెప్పుకొచ్చింది.

అంద‌రూ త‌న‌కు లైఫ్ త్రేటనింగ్ అంటున్నార‌ని, కానీ త‌ను ఉన్న స్టేజ్ లైఫ్ త్రేటనింగ్ కాదు అని చెప్పింది. ''వచ్చింది మాత్రం కష్టమైన వ్యాధి దీంతో నేను పోరాడాలి. కొన్ని రోజులు గుడ్ డేస్ కొన్ని రోజులు బ్యాడ్ డేస్ ఉన్నాయి. ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. ఒక్కో సారి ఇంతదూరం వచ్చాను అనిపిస్తుంది'' అంటూ ఇంట‌ర్వ్యూ ముగించింది సమంత.

First Published:  8 Nov 2022 7:08 AM GMT
Next Story