Telugu Global
CRIME

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం.. - మృతుల్లో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు

కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు మండ‌లం ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో రెండు లారీల క్యాబిన్‌లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి.

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం.. - మృతుల్లో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు
X

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీ అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను దాటి ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ని ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌ల్లో న‌లుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల్లో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, ఇద్ద‌రు క్లీన‌ర్లు ఉన్నారు.

కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు మండ‌లం ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో రెండు లారీల క్యాబిన్‌లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. క్యాబిన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌మాదానికి గురైన న‌లుగురూ అందులో నుంచి బ‌య‌టికి రాలేక అక్క‌డిక‌క్క‌డే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృత‌దేహాలు గుర్తుప‌ట్ట‌లేని విధంగా త‌యార‌య్యాయి. మృతుల్లో కంటైన‌ర్ డ్రైవ‌ర్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వినోద్‌కుమార్ యాద‌వ్‌గా గుర్తించారు. మిగిలిన ముగ్గురి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌మాదానికి గురైన లారీల్లో ఒక‌టి రాజ‌మండ్రి నుంచి విశాఖ‌ప‌ట్నం వైపు వెళుతున్న ఇసుక లారీ. మ‌రొక‌టి వైజాగ్ నుంచి భీమ‌వ‌రం వెళుతున్న రొయ్య‌ల కంటైన‌ర్‌. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మాట్లాడుతూ ఇసుక లారీ టైర్ పంచ‌ర్ కావ‌డంతో అదుపుత‌ప్పి ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని ప్రాథ‌మికంగా గుర్తించామ‌ని చెప్పారు.

First Published:  2 Dec 2022 4:23 AM GMT
Next Story