Telugu Global
CRIME

మధ్యప్రదేశ్‌లో గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలి పరిస్థితి విషమంగానే..

ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు.

మధ్యప్రదేశ్‌లో గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలి పరిస్థితి విషమంగానే..
X

ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ప్రస్తుతం ఆ గర్భిణి 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ.. ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానిక అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్‌పురా గ్రామానికి చెందిన ఓ మహిళ సమీపంలోని బద్‌ఫ్రా గ్రామానికి చెందిన 32 ఏళ్ల సరోజ సఖ్‌బర్ భర్త సురేష్ సఖ్‌బర్‌పై అత్యాచారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో సురేష్ సఖ్బర్ ఈ నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు.

భర్తపై ఉన్న కేసులో రాజీనామా చేసేందుకు సరోజ శుక్రవారం మధ్యాహ్నం చాంద్‌పురా గ్రామానికి చెందిన మహిళ ఇంటికి వెళ్లింది. సరోజ ఎనిమిది నెలల గర్భిణి. అక్కడ ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు సరోజ సఖ్బర్ పై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో భర్త సురేష్ సఖ్‌బర్‌ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కాలుతున్న స్థితిలో మహిళ ఇంటి నుండి బయటకు వచ్చింది.

ప్రజలు మంటలను ఆర్పే సమయానికి ఆమె తీవ్రంగా కాలిపోయింది. మహిళను జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం గ్వాలియర్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని.తన భర్తపై కేసు పెట్టిన మహిళ కూడా వారికి సహకరించింది అని, ఆపై తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

First Published:  18 Feb 2024 7:17 AM GMT
Next Story