Telugu Global
CRIME

మహిళను రైలు కిందకు తోసేసి.. పిల్లలతో పరార్

ఆ సమయంలో నిందితుడు ఆమె వద్దకు వచ్చి నిద్రలేపాడు. కొన్ని సెకన్ల పాటు ఇరువురు ఒకరితో ఒకరు వాదించుకున్నారు. అంతలోనే అతను హఠాత్తుగా ఆమెను ఈడ్చుకుని వెళ్లి ప్లాట్ ఫామ్ నుండి తోసేసి పట్టాల మీద పడేశాడు.

మహిళను రైలు కిందకు తోసేసి.. పిల్లలతో పరార్
X

దూసుకొస్తున్న రైలు కింద పడేలా ఓ మహిళను తోసేసి ఇద్దరు పిల్లలను తీసుకుని ఓ వ్యక్తి పారిపోయిన ఘటన ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు వ్యక్తి.. నిద్రపోతున్న మహిళను నిద్రలేపి.. ఈడ్చుకుని వెళ్లి కదులుతున్న రైలు ముందుకి నెట్టేయటం, ఇద్దరు పిల్లలను తీసుకుని పారిపోవటం కెమెరాలో రికార్డ్ అయింది. అతని భార్య అయి ఉంటుందని భావిస్తున్న ఆ మహిళ మరణించింది. సోమవారం ఉదయం నాలుగు గంటలకు ముంబై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లో భాగమైన వసాయి రైల్వేస్టేషన్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుని అరెస్టు చేశారు.

కెమెరాలో రికార్డ్ అయిన‌ దానిని బట్టి మహిళ ప్లాట్ ఫామ్ బెంచ్ పై నిద్రపోతోంది. ఆ సమయంలో నిందితుడు ఆమె వద్దకు వచ్చి నిద్రలేపాడు. కొన్ని సెకన్ల పాటు ఇరువురు ఒకరితో ఒకరు వాదించుకున్నారు. అంతలోనే అతను హఠాత్తుగా ఆమెను ఈడ్చుకుని వెళ్లి ప్లాట్ ఫామ్ నుండి తోసేసి పట్టాల మీద పడేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవధ ఎక్స్ ప్రెస్ కిందపడి ఆమె మరణించింది. తరువాత అతను ఇద్దరు పిల్లలను తీసుకుని పారిపోతూ కనిపించాడు. ఆదివారం మధ్యాహ్నం నుండి ఆ వ్యక్తి, మహిళ రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. ఘటన జరిగిన అనంతరం ఆ వ్యక్తి మొదట దాదర్ వెళ్లి.. అక్కడి నుండి కల్యాణ్ వెళ్లినట్టుగా రైల్వే పోలీసులు తెలిపారు. థానేలోని భివాండీ పట్టణంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

First Published:  23 Aug 2022 1:42 PM GMT
Next Story