Telugu Global
CRIME

ముస్లిం యువకుడితో ప్రేమ, సోదరిని చేరువులో తోసేసిన అన్న

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్నాదన్న కారణంతో 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడే స్వయంగా చంపేశాడు.

ముస్లిం యువకుడితో ప్రేమ, సోదరిని చేరువులో తోసేసిన అన్న
X

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్నాదన్న కారణంతో 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడే స్వయంగా చంపేశాడు. కోపంలో, ఆవేశంతో యువతిని చెరువులోకి తోసేశాడు. కుమార్తెను రక్షించేందుకు ఆ చెరువులోకి దూకిన తల్లి కూడా మరణించింది.

బెంగళూరు సమీపంలోని హున్‌సూర్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీ, అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు నితిన్ వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ధనుశ్రీ, నితిన్‌ మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన నితిన్‌ తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళే దారిలో సోదరి ధనుశ్రీని చెరువులోకి తోసేశాడు. కూతురిని రక్షించుకోవటానికి తల్లి కూడా చెరువులో దూకింది. అయితే తల్లిని కాపాడటానికి నితిన్ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ధనుశ్రీ, ఆమె తల్లి చెరువులో మునిగి మరణించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిన నితిన్ బంధువులకి ఈ విషయం చెప్పాడు. వారే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన పోలీసులు తల్లీ, కుమార్తె మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నితిన్‌ను అరెస్ట్‌ చేసి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ధనుశ్రీ ప్రేమ వ్యవహారం గురించిన చర్చ వారి కుటుంబంలో జరుగుతూనే ఉందని బందువులు చెబుతున్నారు. పద్దతి మార్చుకొమ్మని ఆమె అన్న పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడని, ప్రతీసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని, అయితే తల్లిదండ్రులు కలుగజేసుకుని శాంతింపచేసేవారని తెలిపారు. తల్లిదండ్రులకు కూడా ఈ సంబంధం ఇష్టం లేదని, అయినా సరే కళ్ల ముందే కన్నకుతురు మునిగి పోతుంటే చూడలేక ఆమె తల్లి చేరువులోకి దూకి ఉంటుందని భావిస్తున్నారు.

First Published:  24 Jan 2024 4:36 PM GMT
Next Story