Telugu Global
CRIME

అల్మారాలో కూతురు.. మంచం కింద తల్లి శవాలు.. గుజరాత్ ఆస్పత్రిలో దారుణం

ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లోని అల్మారాలో 30 ఏళ్ల మహిళ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వారు వెంటనే కాగ్డాపీట్ పోలీసులకు సమాచారం అందించారు.

అల్మారాలో కూతురు.. మంచం కింద తల్లి శవాలు.. గుజరాత్ ఆస్పత్రిలో దారుణం
X

గుజరాత్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో దారుణ సంఘటన జరిగింది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ లోని అల్మారాలో 30 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యం కాగా, అదే ఆస్పత్రిలోని ఓ మంచం కింద ఆమె తల్లి మృతదేహం కూడా లభ్యమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన తల్లీకూతుళ్లు శవాలుగా మారడం సంచలనం సృష్టిస్తోంది. అహ్మదాబాద్ లోని కాగ్డాపీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆసుపత్రి నుంచి తీవ్రంగా దుర్వాసన వస్తుండటంతో ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందా.. అని ఆస్పత్రి సిబ్బంది వెతకడం ప్రారంభించారు.

వారికి ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లోని అల్మారాలో 30 ఏళ్ల మహిళ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వారు వెంటనే కాగ్డాపీట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆస్పత్రి మొత్తం పరిశీలించారు. ఆస్పత్రికి చనిపోయిన మహిళతో పాటు ఆమె తల్లి కూడా వెంట వచ్చిందని తెలుసుకొని ఆమె ఆచూకీ కోసం వెతికారు. వారికి ఆస్పత్రిలోని ఓ మంచం కింద వృద్ధురాలి మృతదేహం కూడా లభ్యమైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి మృతికి కారణంగా అనుమానిస్తూ ఆస్పత్రిలో పనిచేసే మన్ సుఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన తల్లి కూతుళ్లను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? కూతురిపై అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తల్లి అడ్డుకుందా..? అందుకే వారిద్దరిని చంపారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  22 Dec 2022 7:56 AM GMT
Next Story