Telugu Global
CRIME

క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? అయితే బీ కేర్ ఫుల్..

తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్‌ కార్డు అధికారులేనని సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయారు.

క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? అయితే బీ కేర్ ఫుల్..
X

క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టలేదని సిబ్బంది పెట్టిన వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్‌ కార్డు అధికారులేనని సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయారు.

ఈ దారుణ ఘటన కీసరలో జరిగింది. సికింద్రాబాద్‌ లాలాపేటకు చెందిన రాగుల సురేశ్‌ (45), భాగ్య (40) దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట కీసరకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల కిందట టాటా క్రెడిట్‌ లిమిట్స్‌ అనే సంస్థ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని ఓ ప్లాట్‌ కొన్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలనేది వీళ్ల ప్లాన్. అప్పు తీసుకున్న క్రెడిట్‌ సంస్థకు కొంత డబ్బు చెల్లించారు. ఇంకా 4 లక్షలు చెల్లించాల్సి ఉంది.

ఈ క్రమంలో నాలుగు నెలలుగా తరచూ క్రెడిట్‌ కార్డు సిబ్బంది సురేశ్‌ ఇంటికి వచ్చి పెండింగ్‌ బిల్లు చెల్లించాలని గొడవ చేస్తున్నారు. తాజాగా మళ్లీ పెద్ద గొడవ జరిగింది. విషయం కాలనీవాసులకు అందరికీ తెలిసింది. దీంతో తమ పరువు పోయిందని మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారమే తమ పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్‌ కార్డు అధికారులేనని సూసైడ్‌ నోటు రాశారు. శనివారం ఉదయం టిఫిన్‌లో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  18 Feb 2024 9:29 AM GMT
Next Story