Telugu Global
CRIME

9 మందిని బ‌లితీసుకున్న గుండెపోటు..!

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న‌వారు సూర‌త్‌లోని ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ శ‌తాబ్ది మ‌హోత్స‌వ్‌లో పాల్గొని తిరిగి వ‌స్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు ప్ర‌యాణికుల్లో 28 మంది గాయాల‌పాల‌య్యారు.

9 మందిని బ‌లితీసుకున్న గుండెపోటు..!
X

డ్రైవ‌ర్‌కు గుండెపోటు రావ‌డంతో ఘోర‌ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వాహ‌నం అదుపు త‌ప్పి ఎదురుగా వ‌స్తున్న బ‌స్సును బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది మృతిచెంద‌గా, 28 మందికి గాయాల‌య్యాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని న‌వ‌సారి జిల్లా వెస్మా గ్రామంలో శ‌నివారం తెల్ల‌వారుజామున‌ ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అంక‌లేశ్వ‌ర్ ప్రాంతానికి చెందిన వారు ట‌యోటా ఫార్చ్యున‌ర్ (ఎస్‌యూవీ) వాహ‌నంలో వ‌స్లాద్ ప్రాంతం నుంచి త‌మ స్వ‌గ్రామానికి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఈ వాహ‌నంలో ఉన్న 8 మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. తీవ్రంగా గాయ‌ప‌డిన డ్రైవ‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అక్క‌డ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న‌వారు సూర‌త్‌లోని ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ శ‌తాబ్ది మ‌హోత్స‌వ్‌లో పాల్గొని తిరిగి వ‌స్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు ప్ర‌యాణికుల్లో 28 మంది గాయాల‌పాల‌య్యారు. వారిలో తీవ్రంగా గాయ‌ప‌డిన 11 మందిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.

First Published:  31 Dec 2022 6:27 AM GMT
Next Story