Telugu Global
CRIME

క‌న్న బిడ్డ‌ను కొట్టి చంపేశాడు..

ఈ విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని చిన్న కుమార్తెను బెదిరించిన తండ్రి.. అంద‌రికీ త‌న పెద్ద కుమార్తె క‌రెంట్ షాక్‌తో మృతిచెందింద‌ని చెప్పి న‌మ్మించి.. అంత్య‌క్రియ‌లు పూర్తిచేశాడు.

క‌న్న బిడ్డ‌ను కొట్టి చంపేశాడు..
X

త‌న కుమార్తె ఓ యువ‌కుడితో ప్రేమ‌లో ఉంద‌నే విష‌యం తెలిసి తండ్రి భ‌రించ‌లేక‌పోయాడు. ప‌ట్ట‌రాని కోపంతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. త‌న కుమార్తె క‌రెంట్ షాక్‌తో మృతిచెందిందంటూ అంద‌రినీ న‌మ్మించి అంత్య‌క్రియ‌లు పూర్తిచేశాడు. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ జిల్లా క‌ర్చ‌న పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణం జ‌రిగింది.

క‌ర్చ‌న స‌మీపంలోని హిందూబేలా గ్రామ‌స్తుడు ల‌ల్ల‌న్‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. అత‌ని పెద్ద కుమార్తె చాందినీ రెండు నెల‌ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం కుటుంబ స‌భ్యులు గాలించి ఇంటికి తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం చాందినీ త‌న చెల్లి ఆసియాతో క‌లిసి మ‌రోసారి ఇంటి నుంచి పారిపోయింది.

దీంతో ల‌ల్ల‌న్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ ముంబ‌యిలో ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు వారిని తీసుకొచ్చి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలోనే పెద్ద కుమార్తె చాందినీ ఓ యువ‌కుడితో ప్రేమ‌లో ఉంద‌ని ల‌ల్ల‌న్‌కు తెలిసింది. దీంతో అత‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. పెద్ద కుమార్తెను గ‌దిలో బంధించి చిత‌క బాదాడు. ఆ దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ విష‌యం ఎవ‌రికీ చెప్పొద్ద‌ని చిన్న కుమార్తెను బెదిరించిన తండ్రి.. అంద‌రికీ త‌న పెద్ద కుమార్తె క‌రెంట్ షాక్‌తో మృతిచెందింద‌ని చెప్పి న‌మ్మించి.. అంత్య‌క్రియ‌లు పూర్తిచేశాడు. అయితే అక్క‌ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయిన ఆసియా గ్రామ‌స్తుల‌కు విష‌యాన్ని చెప్పేయ‌డంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ల‌ల్ల‌న్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘ‌ట‌న‌పై కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  27 March 2023 3:53 AM GMT
Next Story