Telugu Global
CRIME

తండ్రిని చంపి సవతి తల్లిపై అత్యాచారం

ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో తండ్రి జోక్యం చేసుకొని భార్యకు మద్దతుగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు కత్తితో అతడిపై దాడి చేసి నరికి చంపాడు.

తండ్రిని చంపి సవతి తల్లిపై అత్యాచారం
X

మానవ సంబంధాలు రాను రానూ తప్పుదోవపడుతున్నాయి. కొందరు దుర్మార్గులు వావి వరుసలు కూడా చూడటం లేదు. సొంత కుమార్తె పైన, చెల్లెళ్ల పైన అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తరచూ వార్తలు వింటున్నాం. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఇటువంటి ఘటనే జరిగింది. తల్లి చనిపోగా తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో సవతి తల్లిపై ఆగ్రహం పెంచుకున్న కుమారుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతకుముందు తండ్రిని హత్య చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

జాజ్ పూర్ జిల్లా టోమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. కాగా ఇతడికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వృద్ధాప్యంలో తోడుగా ఒకరు ఉండాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం జరిగిన తర్వాత కుమారుడు ఇంట్లో ఉండటానికి సవతి తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు కొద్దిరోజులుగా సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్నాడు. తండ్రితో కలిసి ఉండేందుకు సవతి తల్లి ఒప్పుకోకపోవడంపై నిత్యం సవతి తల్లి, కుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన కుమారుడు సవతి తల్లిపై మరోసారి గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ప‌ద‌జాలంతో దూషించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో తండ్రి జోక్యం చేసుకొని భార్యకు మద్దతుగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు కత్తితో అతడిపై దాడి చేసి నరికి చంపాడు.

ఆ తర్వాత సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణంపై బాధిత మహిళ టోమ్కా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని హత్య చేసి సవతి తల్లిపై అత్యాచారం చేసిన యువకుడిని విచారిస్తున్నారు.

First Published:  9 March 2023 5:07 AM GMT
Next Story