Telugu Global
Cinema & Entertainment

Vishal | నేను ఎవ్వరి మాట వినను

Vishal - తను ఎవ్వరి మాట విననంటున్నాడు హీరో విశాల్. రత్నం సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Vishal | నేను ఎవ్వరి మాట వినను
X

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా రత్నం. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను సతీష్ రిలీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 26న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొన్నాడు. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.

"19 ఏళ్ల నా కెరీర్‌లో మీడియా, ఫ్యాన్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్లందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. వాడు వీడు సినిమా టైంలో మెల్ల కన్ను పెట్టి నటించొద్దని అన్నారు.. కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు.. నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను."

ఇలా తన నిబద్ధతను బయటపెట్టాడు విశాల్. దర్శకుడు హరితో గతంలో భరణి, పూజ సినిమాలు చేశాడు విశాల్. అవి రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా రత్నం చేశాడు. ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదు, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా అంటున్నాడు విశాల్.

దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రాజేష్ తెలుగు వెర్షన్ కు డైలాగ్స్ రాశాడు. డైరక్టర్ హరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో కూడా ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ చాలా బాగుంటుందంటున్నాడు విశాల్.

First Published:  21 April 2024 8:39 AM GMT
Next Story