Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్2 అయిపోయింది.. ఇప్పుడు విక్రమ్ వంతు

కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలు టీవీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు విక్రమ్ వంతు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ బుల్లితెరపై హంగామా చేయడానికి సిద్ధమైంది.

కేజీఎఫ్2 అయిపోయింది.. ఇప్పుడు విక్రమ్ వంతు
X

థియేటర్లలో హిట్టయిన సినిమా టీవీల్లో హిట్టవ్వాలనే గ్యారెంటీ లేదు. అదే విధంగా ఫ్లాప్ అయిన సినిమా, టీవీల్లో కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పలేం. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్2 సినిమా టీవీల్లో యావరేజ్ గా నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ వంతు వచ్చింది.

కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా, త్వరలోనే టీవీల్లో ప్రత్యక్షం కాబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఈనెల 11న సాయంత్రం ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారు. కేజీఎఫ్2 సినిమాను తొలిసారి ప్రసారం చేసినప్పుడు 9 టీఆర్పీ వచ్చింది. విక్రమ్ సినిమా ఏ స్థాయి రేటింగ్ దక్కించుకుంటుందనేది చూడాలి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా వరల్డ్ వైడ్ సూపర్ హిట్టయింది. తెలుగులో కూడా ఈ సినిమా ఊహించని విజయాన్నందుకుంది. కమల్ హాసన్ కు ఎట్టకేలకు ఓ బ్లాక్ బస్టర్ అందించింది. ఈ సినిమా తర్వాతే కమల్ హాసన్ మార్కెట్ మరోసారి ఊపందుకుంది.

First Published:  5 Sep 2022 7:31 AM GMT
Next Story