Telugu Global
Cinema & Entertainment

ఈవెంట్ మధ్యలో వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ

ముంబయిలో లైగర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కారణం ఏంటో తెలుసా?

ఈవెంట్ మధ్యలో వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
X

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ఈనెలలో ఈ సినిమా రిలీజ్ ఉంది. పైగా పాన్ ఇండియా సినిమా. అందుకే చాలా రోజుల కిందట్నుంచే ప్రచారం మొదలుపెట్టారు. టీజర్లు, ట్రయిలర్లు, లిరికల్ వీడియోస్ తో హంగామా చేసిన యూనిట్, ఇప్పుడు నేరుగా హీరోహీరోయిన్లను రంగంలోకి దించింది.

ముంబయిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే పర్యటించారు. ప్రేక్షకులతో మాట్లాడారు. లైగర్ విశేషాలు చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో రాత్రి జరిగిన ఓ ఈవెంట్ నుంచి విజయ్ దేవరకొండ మధ్యలోనే బయటకొచ్చేశాడు. దీనికి కారణం ఊహించని విధంగా పెరిగిపోయిన జనం.

ముంబయిలోని ఎస్జీసీ మాల్ లో రాత్రి గ్రౌండ్ ఈవెంట్ పెట్టారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే వస్తున్నారని ప్రచారం చేశారు. దీంతో మాల్ కు జనం పోటెత్తారు. మాల్ లో ఉన్న 5 ఫ్లోర్లు కిక్కిరిసిపోయాయి. ఊహించని విధంగా వచ్చిన జనాన్ని చూసి యూనిట్ ఖంగుతింది.

ఎలాగోలా విజయ్, అనన్యను స్టేజ్ పైకి తీసుకెళ్లారు. కానీ జనాల్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాలేదు. అంతా ఎగబడ్డారు. మాల్ పూర్తిగా టైట్ అయింది. దీంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని భావించిన యూనిట్, మధ్యలోనే కార్యక్రమాన్ని ఆపేసింది. స్వయంగా విజయ్ చొరవ తీసుకొని ఈవెంట్ ను మధ్యలోనే రద్దుచేశాడు. ఇకపై ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యూనిట్ కు అర్థమైంది.








First Published:  1 Aug 2022 4:01 AM GMT
Next Story