Telugu Global
Cinema & Entertainment

Mark Antony - తెలుగులో తొలిసారి పాట పాడిన విశాల్

Vihal Mark Antony - మార్క్ ఆంటోనీ సినిమా కోసం తొలిసారి తెలుగులో పాట పాడాడు విశాల్. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.

Mark Antony - తెలుగులో తొలిసారి పాట పాడిన విశాల్
X

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విశాల్.. ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రాన్ని వినాయక చవితికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15న తేదీని ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీమ్.

తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా అంటూ సాగిపోతున్న ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడాడు. దీంతో ఈ సాంగ్ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది.

విశాల్ తెలుగులో పాడిన తొలి పాట ఇది. ఇదే పాటను తమిళ్ లో శింబు తండ్రి రాజేందర్ ఆలపించారు. ఇకపోతే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. గుబురు గడ్డంతో ఉన్నాడు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరిస్తుందని చెబుతున్నాడు విశాల్.



First Published:  14 July 2023 4:42 PM GMT
Next Story