Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ మూవీ.. మరోసారి రంగంలోకి 'యూవీ'?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది.

ప్రభాస్ మూవీ.. మరోసారి రంగంలోకి యూవీ?
X

ప్రభాస్ ను, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను విడదీసి చూడలేం. ఎందుకంటే దాదాపు ప్రభాస్ కు హోమ్ బ్యానర్ అది. నష్టాలొచ్చినా, లాభాలొచ్చినా అందరూ కలిసి షేర్ చేసుకుంటారు. అయితే రీసెంట్ గా ఈ సంస్థకు లాభాల్లేవ్. అన్నీ నష్టాలే. అది కూడా ప్రభాస్ కారణంగా.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు అతిపెద్ద కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఈ సినిమా బయ్యర్లను నిలువునా ముంచింది. చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేయడంతో యూవీ నిర్మాతలు కూడా భారీ నష్టాలు చవిచూశారు. దీంతో వాళ్లను నష్టాల నుంచి కొంచెమైనా బయటపడేసేందుకు ప్రభాస్ ఓ చక్కని ఆలోచన చేశాడు.

తను నటిస్తున్న ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్ ను యూవీ క్రియేషన్స్ సంస్థతో కొనిపించాడు ప్రభాస్. దాదాపు వంద కోట్ల రూపాయలకు ప్రభాస్ ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యూవి సంస్థ దక్కించుకుంది. అయితే ఈ సినిమాతో పాత నష్టాలు కొన్ని తీరుతాయా లేక కొత్త నష్టాలు మొదలవుతాయా అనేది అసలు సమస్య.

ఎందుకంటే, వంద కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఆ డబ్బులు వెనక్కి రావాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఘన విజయం సాధించాలి. లేదంటే బయ్యర్ల నుంచి యూవీ నిర్మాతలకు సెగ తప్పదు.

First Published:  4 Sep 2022 12:33 PM GMT
Next Story