Telugu Global
Cinema & Entertainment

Trisha | విశ్వంభర సెట్స్ పైకొచ్చిన త్రిష

Trisha - దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిశారు. విశ్వంభర సినిమా చేస్తున్నారు.

Trisha | విశ్వంభర సెట్స్ పైకొచ్చిన త్రిష
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈరోజు త్రిష, విశ్వంభర సెట్స్ లో జాయిన్ అయింది. స్వయంగా చిరంజీవి, త్రిషను సాదరంగా ఆహ్వానించారు.

చిరంజీవి-త్రిష కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి స్టాలిన్ అనే సినిమా చేశాడు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా విశ్వంభర కోసం కలిశారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరు-త్రిషపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల 13 భారీ సెట్స్ వేశారు.

వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వంభర సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేయబోతున్నారు.

First Published:  5 Feb 2024 4:58 PM GMT
Next Story