గౌతంరాజు కొడుకు హీరోగా మూవీ ఆరంభం
BY Telugu Global22 Aug 2022 1:29 PM GMT
X
Telugu Global Updated On: 22 Aug 2022 1:29 PM GMT
కమెడియన్ గౌతం రాజు కొడుకు కృష్ణ, సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, రేలంగి నరసింహారావు, గౌతం రాజు, ప్రసన్న కుమార్, రామ సత్యనారాయణ, డి ఎస్ రావు, ఆర్టిస్ట్ మాధవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.
Next Story