Telugu Global
Cinema & Entertainment

ఫ్రాంచైజీగా మహేష్ - రాజమౌళి మూవీ.. విజయేంద్ర ప్రసాద్ కీలక అప్డేట్

రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా ఫ్రాంచైజీగా రూపొందనున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ మహేష్ -రాజమౌళి సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు.

ఫ్రాంచైజీగా మహేష్ - రాజమౌళి మూవీ.. విజయేంద్ర ప్రసాద్ కీలక అప్డేట్
X

బాహుబలి వంటి భారీ బడ్జెట్ మూవీని రెండు భాగాలతో ఫ్రాంచైజీగా తీసుకొచ్చాడు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను ఫ్రాంచైజీగా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఈ సినిమాకు కథ అందిస్తున్న రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. మహేష్- రాజమౌళి కాంబినేషన్లో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్నట్లు ఇదివరకే ప్రకటన వచ్చింది. మహేష్ తొలిసారిగా ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఏ మూవీ ఒకే భాగంగా తెరకెక్కుతుందని అభిమానులు భావించగా.. రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా ఫ్రాంచైజీగా రూపొందనున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ మహేష్ -రాజమౌళి సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును ఒక సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సీక్వెల్స్ ఉంటాయని చెప్పారు. ప్రతి సీక్వెల్లో ప్రధాన పాత్రలు అలాగే కొనసాగుతాయని.. కానీ, కథా నేపథ్యం మారుతుందని వెల్లడించారు.

కాగా.. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి తన తాజా సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లిస్ట్ లో ఉండడంతో అందుకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. వీరిద్దరూ ఫ్రీ అయిన వెంటనే కొత్త సినిమా ప్రారంభం కానుంది. మామూలుగా రాజమౌళి ఒక్కొక్క సినిమాను పూర్తి చేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటూ ఉంటాడు. ఇక మహేష్ తో చేసేది ఫ్రాంచైజీ కావడంతో ఏళ్లకు ఏళ్ళు జక్కన్నతో మహేష్ గడపాల్సి ఉంటుందని ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  31 Dec 2022 10:57 AM GMT
Next Story