Telugu Global
Cinema & Entertainment

సుక్కూ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

త్వరలోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నాడు సుకుమార్. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది.

సుక్కూ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
X

ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిన సుకుమార్, సంచలన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, కాశ్మీర్ ఫైల్స్‌, కార్తికేయ 2 వంటి హిట్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు.

ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. కాకపోతే అది పాన్ ఇండియా ప్రాజెక్టు అనేది మాత్రం పక్కా.

అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేయనున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.

ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ స్వయంగా ప్రకటన చేశారు. కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సుకుమార్ దర్శకత్వం వహిస్తాడా లేక వివేక్ డైరక్ట్ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  5 Nov 2022 12:37 PM GMT
Next Story